రోడ్ యాక్సిడెంట్‌‌లో చిన్నారితో సహా దంపతులు దుర్మరణం

రోడ్ యాక్సిడెంట్‌‌లో చిన్నారితో సహా దంపతులు దుర్మరణం

మదనపల్లె: ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో చిన్నారితో సహా దంపతులు మృతి చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి చిత్తూరులోని మదనపల్లి మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లి రూరల్ ఎస్ఐ దిలీప్ కుమార్ చెప్పిన వివరాలు.. కర్నాటకలోని కోలారు జిల్లా, రాయల్పాడు మండలం వేపనహళ్లికి చెందిన నరేష్, అతడి భార్య ఉమాదేవి బతుకుదెరువు కోసం మదనపల్లెలోని బసినికొండలో ఉంటున్నారు. వీరికి నిశిత ఆనే ఏడేళ్ళ కుమార్తె ఉంది. 

నరేష్ తన బైక్‌పై స్వగ్రామానికి వెళ్లి శనివారం రాత్రి తిరుగు ప్రయాణంలో మదనపల్లెకు వస్తుండగా బెంగళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరీ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం అతడ్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు చిన్నారి కూడా దుర్మరణం చెందారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ దిలీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.